ఘనంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం.. వైవీయులో టి.ఎన్.ఎస్.ఎఫ్. కోలాహలం.
ఘనంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం..
వైవీయులో టి.ఎన్.ఎస్.ఎఫ్. కోలాహలం.
వై. వి. యు. పెండ్లిమర్రి మేజర్ న్యూస్...
యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈరోజు సాయంకాలం తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుక లు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహింపబడ్డాయి. టి.ఎన్.ఎస్.ఎఫ్. నాయకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మట్టి గణపతి ని ప్రతిష్టించి గత మూడు రోజులుగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కమలాపురం శాసనసభ్యులు చైతన్య రెడ్డి కడప జిల్లా టిడిపి అధ్యక్షులు భూమేష్ రెడ్డి వై. వి. యు. వి.సి.ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ పాల్గొన్నారు.. కార్యక్రమం టీఎన్ఎస్ అపాధ్యక్షుడు భరత్ సింహా, జిల్లా అధ్యక్షులు తిరుమలేష్, నాయకులు వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.