దేశంలో 52కి చేరిన చిరుతల సంఖ్య
కునో నేషనల్ పార్క్ నివేదిక
షోపూర్ (మధ్యప్రదేశ్): భారతదేశంలో ప్రారంభించిన చిరుతల పునఃప్రవేశ ప్రాజెక్టు నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన సమీక్షా నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం చిరుతల సంఖ్య 52కి చేరింది. సెప్టెంబర్ 17, 2022 నుండి సెప్టెంబర్ 17, 2026 వరకు ఉన్న వివరాలతో కునో నేషనల్ పార్క్ "భారతదేశంలో చిరుతలు - నాలుగేళ్ల స్థితిగతుల సమీక్ష" నివేదికను విడుదల చేసింది. ఈ మొత్తం 52 చిరుతలలో ఏకంగా 32 చిరుతలు భారత్లోనే జన్మించడం విశేషం.
ప్రస్తుతం మొత్తం చిరుతలలో 49 కునో జాతీయ ఉద్యానవనంలో ఉండగా, మరో మూడు గాంధీ సాగర్ అభయారణ్యంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుండి తీసుకువచ్చిన చిరుతలతో పాటు నమీబియా, దక్షిణాఫ్రికా మూలాలున్న చిరుతలకు పుట్టిన పిల్లలు, అలాగే ఇటీవల బోట్స్వానా నుండి తీసుకువచ్చిన 9 చిరుతలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం కునోలో ఉన్న 49 చిరుతలలో 17 స్వేచ్ఛగా అడవిలో సంచరిస్తుండగా, 32 చిరుతలను ప్రత్యేక ఆవరణలలో (సాఫ్ట్ రిలీజ్ బోమాస్) ఉంచారు. భారత్లోనే జన్మించిన రెండవ తరం పిల్లలు మనుగడ సాగించడం ప్రాజెక్టు సాధించిన అతిపెద్ద విజయమని అధికారులు పేర్కొన్నారు.