BREAKING
‘నెరిస్ట్’లో ఆవిష్కరణలు, శ్రేష్ఠతకు అరుణాచల్ గవర్నర్ పిలుపు లడఖ్‌లో ఎన్‌సీసీ బాలికల రికార్డు పర్వతారోహణ మక్కా సమీపంలో డ్రోన్ దాడిని ఖండించిన భారత్ వికసిత్ భారత్ సాధనకు ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యూహాత్మక ఆవశ్యకత 1 కోటికి పైగా పట్టణ గృహాల నిర్మాణం పూర్తి ఓజోన్ పొర పరిరక్షణ, వాతావరణ చర్యలకు భారత్ కట్టుబాటు లార్జ్-క్యాప్స్ మెరుపు రూ. 3 లక్షల వరకు ఎగుమతులకు 'RCMC' నుంచి మినహాయింపు దుబాయ్ కాలేదు.. ‘దెయ్యాల ఓడరేవు’గా మారిన పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్! అమెరికా ఉత్పత్తులను బహిష్కరిస్తున్న కెనడియన్లు రైతుల భవిష్యత్తుకు ఆర్థిక ధీమా ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ. 25,000కు పెంపు యుద్ధ నేరాల కేసులో కొసోవో మాజీ అధ్యక్షుడు థాసికి 25 ఏళ్ల జైలు శిక్ష యెమెన్‌పై సౌదీ బాంబుల వర్షం వాయు కాలుష్యంతో ఆత్మహత్యా ఆలోచనల ప్రమాదం

మక్కా సమీపంలో డ్రోన్ దాడిని ఖండించిన భారత్

Select Suryaa Now
మక్కా సమీపంలో డ్రోన్ దాడిని ఖండించిన భారత్

ప్రాంతీయ శాంతికి పిలుపు
న్యూఢిల్లీ:సౌదీ అరేబియాలోని పవిత్ర నగరమైన మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడి ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను దెబ్బతీసేలా పౌరుల ప్రాణాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిపే ఎలాంటి దాడులైనా ఖండించదగినవని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో త్వరలోనే శాంతి, స్థిరత్వాలు పునరుద్ధరించబడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మక్కా నగరం అత్యంత పవిత్రమైనదని, అలాంటి ప్రాంత సమీపంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళనకరమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన డ్రోన్‌ను మక్కా దక్షిణ ప్రాంతంలో తమ వైమానిక దళాలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలిపింది. పవిత్ర స్థలాలు, యాత్రికుల భద్రత తమకు రెడ్ లైన్ అని సౌదీ సంకీర్ణ దళాలు హెచ్చరించగా.. ఈ ఆరోపణలను హౌతీ తిరుగుబాటుదారులు ఖండించారు. తమ పోరాటం కేవలం సైనిక, చమురు స్థావరాలపైనేనని స్పష్టం చేశారు.