లార్జ్-క్యాప్స్ మెరుపు
23,200 పైన ముగిసిన నిఫ్టీ, 333 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!
ముంబై:ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు లార్జ్-క్యాప్ షేర్లలో విలువ కొనుగోళ్లు (Value Buying) పెరగడంతో భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 50 సూచీ 99 పాయింట్లు (0.43%) లాభపడి 23,217.60 వద్ద స్థిరపడగా, బీఎస్ఈ సెన్సెక్స్ 332.63 పాయింట్లు (0.45%) పెరిగి 74,336.45 వద్ద లాభాలతో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై పెట్టుబడిదారులలో ఉన్న సానుకూల అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి.
బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలు మార్కెట్ లాభాలకు నాయకత్వం వహించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.82%, పీఎస్యూ బ్యాంక్ 1.27%, ప్రైవేట్ బ్యాంక్ 0.73% లాభపడ్డాయి. మరోవైపు, లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టీ ఐటీ 1.79% క్షీణించింది. ఎస్బిఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐటిసి, ట్రెంట్ షేర్లు ప్రధానంగా లాభపడగా.. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి ఐటీ షేర్లు వెనుకబడ్డాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 108 డాలర్లకు చేరగా, బంగారం (10 గ్రాములు) రూ. 1,51,925 వద్ద, వెండి కిలోకు రూ. 2,35,280 వద్ద నమోదయ్యాయి. జపాన్, తైవాన్, కొరియా వంటి ప్రధాన ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.