వెళ్లి రావయ్యా గణపయ్య
వెళ్లి రావయ్య గణపయ్య
వైభవంగా నిమజ్జనం వేడుకలు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
విఘ్నాలు తొలగించే ఆది దేవతల ఆదిపుత్ర ఇక వెళ్లిరమ్మ.. అంటూ గణపతి నామస్మరణతో బుధవారం గణపయ్య నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మిగనూరు పట్టణంలో 276 గణనాథులను తుంగభద్ర దిగువ కాలువలో నిమజ్జనం చేశారు. పట్టణ పలు వీధుల నుండి గణనాథులను పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. ప్రతి వినాయకుని విగ్రహం సోమప్ప సర్కిల్ చేరుకుని అక్కడి నుండి తుంగభద్ర దిగువ కాలువ వరకు యువతలో ఉత్సాహంతో చేసిన పలు సాంస్కృతి కార్యక్రమాలతో పాటు డప్పులు,డిజె శబ్దాలకు చిందులేస్తూ గణపతి బప్పా మోరియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో నిమజ్జన కార్యక్రమం ముగించారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పర్యవేక్షణలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా గెట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు.