వాగులో పడి అన్నాచెల్లెలు మృతి
సూర్య, నవీపేట్:
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లే గణేష్ (27), అల్లే లయ (24) అన్నాచెల్లెలు వాగులో పడి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.