BREAKING
గణపతికి సీఎం పూజలు ప్రజాసేవే దామోదర్ రెడ్డి ఆశయం, మానవతా సేవే దామన్నకు నిజమైన నివాళి:- చెవిటి వెంకన్న యాదవ్ రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో ప్రత్యేక అలంకరణ నవరాత్రుల తొలిరోజు హరిద్రవర్ణం అలంకరణలో స్వామివారి దర్శనం. అష్ట స్వయంవ్యక్త క్షేత్రం శ్రీమూష్నం.. సర్వరోగాలు నయం చేసే నిత్య పుష్కరిణి, మత సామరస్య విశేషాలు ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన ఇంద్రకీలాద్రిపై కొలువైన అపరాజితా దేవి విశిష్టత.. సర్వకార్య విజయాలను ప్రసాదించే చండీ సప్తశతి స్తోత్రం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు ఆ ఊరి.. గణనాధునికి ‘బొర్ర పోతన’గా పేరు... UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్‌ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్

సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి* *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు*

Select Suryaa Now
సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి*   *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు*

*సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి*

 *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు*

*ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ*

 *ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని శ్రీరామ్ విజ్ఞప్తి*

సిల్క్ సిటీగా ఉన్న ధర్మవరం పట్టణం గ్రీన్ సిటీగా మారాలని... అలాగే కాలుష్య రహిత పట్టణంగా ఉండాలని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు. ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి విగ్రహాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్యవైశ్య యువజన సంఘాన్ని శ్రీరామ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం పట్టణానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారని... ఇలాంటి సమయంలో మన ప్రాంతం పరిశుభ్రంగా కాలుష్యరహితంగా ఉండాలన్నారు. అలాగే పెద్ద ఎత్తున మొక్కలు పెంచి గ్రీన్ ధర్మవరంగా మారాలని కోరుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు. కాలుష్యరహిత సమాజం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు..…