BREAKING
రాప్తాడు వైసీపీలో ముసలం.. తోపుదుర్తిపై తిరుగుబాటు! పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి పెడన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు: ఉపయోగంలోకి రాని మరుగుదొడ్లు.. అధికారుల నిర్లక్ష్యంపై జేఏసీ ఆగ్రహం భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్ ఆగస్టు 2026లో భారతీయ రైల్వే రికార్డు పురోగతి అనుమానస్పద మృతి గ్లోబల్ సౌత్‌కు గ్లోబల్ డిసిషన్లలో చోటుండాలి బ్రిక్స్ సమగ్ర వికాసానికి నాలుగు మూలస్తంభాలు నిరాడబరంగా బార్మీ జరుపుకోవాలని బ్రిక్స్ బహిరంగ సమావేశానికి ముందు భారత్ మండపంలో ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ సాదర స్వాగతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ముంబైని ముంచెత్తిన భారీ వర్షం తిరుమలలో బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ

జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్

Select Suryaa Now
జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్

వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని, మండపాలకు అనుమతులు తప్పనిసరి అని, డీజేలకు అనుమతి లేదని ఖాజీపేట సీఐ వంశీధర్ సూచించారు.వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఖాజీపేట పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వంశీధర్ ప్రజలకు సూచించారు. ఖాజీపేట మండల ప్రజలకు ఆయన ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖాజీపేట మండల పరిధిలోని అన్ని  గ్రామాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు. విగ్రహాలను ఏర్పాటు చేసుకునే ముందు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు.వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రాంగణం వల్ల స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.