BREAKING
టీడీపీ కార్యకర్త నెట్టెం కేశవ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్ రాప్తాడు వైసీపీలో ముసలం.. తోపుదుర్తిపై తిరుగుబాటు! పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి పెడన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు: ఉపయోగంలోకి రాని మరుగుదొడ్లు.. అధికారుల నిర్లక్ష్యంపై జేఏసీ ఆగ్రహం భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్ ఆగస్టు 2026లో భారతీయ రైల్వే రికార్డు పురోగతి అనుమానస్పద మృతి గ్లోబల్ సౌత్‌కు గ్లోబల్ డిసిషన్లలో చోటుండాలి బ్రిక్స్ సమగ్ర వికాసానికి నాలుగు మూలస్తంభాలు నిరాడబరంగా బార్మీ జరుపుకోవాలని బ్రిక్స్ బహిరంగ సమావేశానికి ముందు భారత్ మండపంలో ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ సాదర స్వాగతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

 

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి
స్థానిక కౌన్సిలర్ దావల్ గారి గోపాల్ రెడ్డి

చేవెళ్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13): చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు పామేనలో కౌన్సిలర్ దావల్ గారి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ రాము గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని కౌన్సిలర్ దావల్ గారి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఫరిన్ ఖదీర్ పాషా, మండల కార్యదర్శి టేకులపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.