BREAKING
జాతీయ లోక్ అదాలత్ లో 2132 కేసుల పరిష్కారం బ్యాటర్ల హోరు.. పది సిక్సర్లు, ఏడు ఫోర్లతో విరుచుకుపడ్డ రైట్ హ్యాండ్ బ్యాటర్ 26న సత్యసాయి జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హైదరాబాద్‌లో పెరిగిన పూల ధరలు.. వినాయక చవితి వేళ మార్కెట్లలో రద్దీ! భూ బాధితుల పై పోలీసుల ఉక్కుపాదం..! ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ వినాయక చవితి సెలవులపై స్పష్టత.. విద్యాసంస్థల హాలిడేస్ పై లేటెస్ట్ అప్‌డేట్! ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జోరు.. కోస్తా, రాయలసీమలో వానలకు అవకాశం! తెలంగాణలో మరోసారి వర్షాల జోరు.. ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం! ‘క్రేజీ కల్యాణం’ నుంచి ‘కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్ విడుదల.. ఫుల్ జోష్‌లో మాస్ బీట్స్! తెలంగాణలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు! ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేడు కేజీ వెండి రేటు ఎంతంటే? మైదుకూరు అభివృద్ధి ప్రస్థానం న్యూఢిల్లీలో మొక్కలు నాటిన బ్రిక్స్ నేతలు

భూ బాధితుల పై పోలీసుల ఉక్కుపాదం..!

Select Suryaa Now
భూ బాధితుల పై పోలీసుల ఉక్కుపాదం..!

 

పరిగి బస్టాండ్‌లో రోజంతా బైఠాయింపు.. అర్ధరాత్రి 1:30 గంటలకు రైతుల అరెస్ట్

పరిగి, మేజర్ న్యూస్: కాళ్లపూర్ భూబాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం పరిగి బస్టాండ్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిగి ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భూబాధితులు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

తమ భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని భూబాధితులు డిమాండ్ చేశారు. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు.

అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో భూబాధితులు నిరసనను కొనసాగించారు. దీంతో అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో పోలీసులు బస్టాండ్ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

భూబాధితుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా పట్టించుకుని, వారి భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.