ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ
ధర్మవరం:
పట్టణంలోని 22వ వార్డు సాయినగర్లో ఆదివారం ఉదయం వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ ఓం ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు మట్టి విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ.. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల కంటే మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దాదాపు 100 కుటుంబాలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి, అవగాహన కల్పించినట్లు ఓం ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.