BREAKING
టీడీపీ కార్యకర్త నెట్టెం కేశవ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్ రాప్తాడు వైసీపీలో ముసలం.. తోపుదుర్తిపై తిరుగుబాటు! పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి పెడన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు: ఉపయోగంలోకి రాని మరుగుదొడ్లు.. అధికారుల నిర్లక్ష్యంపై జేఏసీ ఆగ్రహం భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్ ఆగస్టు 2026లో భారతీయ రైల్వే రికార్డు పురోగతి అనుమానస్పద మృతి గ్లోబల్ సౌత్‌కు గ్లోబల్ డిసిషన్లలో చోటుండాలి బ్రిక్స్ సమగ్ర వికాసానికి నాలుగు మూలస్తంభాలు నిరాడబరంగా బార్మీ జరుపుకోవాలని బ్రిక్స్ బహిరంగ సమావేశానికి ముందు భారత్ మండపంలో ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ సాదర స్వాగతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

Select Suryaa Now
గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

డీజే లకు నో.. రాత్రి 10 తర్వాత లౌడ్‌స్పీకర్లు బంద్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

జీనోమ్ వ్యాలీ సీఐ 
గోపగాని గురువయ్య గౌడ్
శామీర్ పేట,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ......
ప్రతి మండపాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, హార్డ్‌కాపీని పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని,
మండపాల వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, నీటి డ్రమ్ములు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని, అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మండపాలు, శోభాయాత్రల్లో డీజే లకు పూర్తిగా నిషేధం ఉందని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. మద్యం, జూదం, టపాసులు, అభ్యంతరకర నినాదాలు, ఇతరుల మనోభావాలను కించపరిచే కార్యక్రమాలకు తావులేదన్నారు.
నిమజ్జన శోభాయాత్రను పోలీసుల సూచనల మేరకు నిర్వహిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రశాంతమైన గణేష్ ఉత్సవాలకు ప్రజలు, నిర్వాహకుల సహకారం అత్యంత అవసరమని సీఐ గోపగాని గురువయ్య గౌడ్ అన్నారు.