భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం
ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే
ఉప్పల్ మండే మార్కెట్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా ఆటో యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆటో యూనియన్ అధ్యక్షులు యాదగిరి, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు ఆటో యూనియన్ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గుడి మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అభినందించారు మరియు నిర్వాహకులు, ఆటో యూనియన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, ఆటో యూనియన్ సభ్యులు,స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
ఈరెల్లి రవీందర్ రెడ్డి శనిగరం తిరుమలేష్ జట్ట కిషోర్, శ్రీనివాస్ రెడ్డి సుక్క కిరణ్ తదితరులు పాల్గొన్నారు