BREAKING
పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి పెడన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు: ఉపయోగంలోకి రాని మరుగుదొడ్లు.. అధికారుల నిర్లక్ష్యంపై జేఏసీ ఆగ్రహం భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్ ఆగస్టు 2026లో భారతీయ రైల్వే రికార్డు పురోగతి అనుమానస్పద మృతి గ్లోబల్ సౌత్‌కు గ్లోబల్ డిసిషన్లలో చోటుండాలి బ్రిక్స్ సమగ్ర వికాసానికి నాలుగు మూలస్తంభాలు నిరాడబరంగా బార్మీ జరుపుకోవాలని బ్రిక్స్ బహిరంగ సమావేశానికి ముందు భారత్ మండపంలో ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ సాదర స్వాగతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ముంబైని ముంచెత్తిన భారీ వర్షం తిరుమలలో బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

Select Suryaa Now
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

ట్రాఫిక్, లోకల్ రైళ్లకు తీవ్ర అంతరాయం
మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ముంబై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వాణిజ్య రాజధాని ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. శనివారం రాత్రి ప్రారంభమైన వర్షం ఆదివారం నాటికి తీవ్ర రూపం దాల్చడంతో నగరంలోని దాదర్, కుర్లా, నలసోపారా, వసాయి-విరార్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కుర్లా స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌లపై భారీగా నీరు చేరడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. నలసోపారా, తులింజ్ బ్రిడ్జి పరిసర రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం కూడా వర్ష సూచన ఉన్నట్లు స్పష్టం చేసింది.

వినాయక చవితి ఉత్సవాల వేళ వర్షాలు పడుతుండటంతో ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం విగ్రహాల నిమజ్జన ఊరేగింపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు, రవాణా శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.