BREAKING
పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి పెడన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు: ఉపయోగంలోకి రాని మరుగుదొడ్లు.. అధికారుల నిర్లక్ష్యంపై జేఏసీ ఆగ్రహం భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్ ఆగస్టు 2026లో భారతీయ రైల్వే రికార్డు పురోగతి అనుమానస్పద మృతి గ్లోబల్ సౌత్‌కు గ్లోబల్ డిసిషన్లలో చోటుండాలి బ్రిక్స్ సమగ్ర వికాసానికి నాలుగు మూలస్తంభాలు నిరాడబరంగా బార్మీ జరుపుకోవాలని బ్రిక్స్ బహిరంగ సమావేశానికి ముందు భారత్ మండపంలో ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ సాదర స్వాగతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ముంబైని ముంచెత్తిన భారీ వర్షం తిరుమలలో బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

తిరుమలలో బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ

Select Suryaa Now
తిరుమలలో బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ

తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా రేపు సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించనున్నారు. అనంతరం రాత్రి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించనున్నారు.

ఎల్లుండి మధ్యాహ్నం మాడవీధుల్లో శ్రీవారి పరివార దేవతలు, గరుడ పఠం ఊరేగింపు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం జరగడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.

ధ్వజారోహణం అనంతరం ఎల్లుండి రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్దశేష వాహన సేవ వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలిరానున్నారు. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, వసతి, భద్రత తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.