|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 03:35 PM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన క్రికెటర్ టి. అరుణ్ కుమార్ శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యారు. మార్చి 15 నుంచి శ్రీలంకలో జరగనున్న సిరీస్ లో ఆయన ఆడనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అరుణ్ కుమార్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. గద్వాల ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో వెలగడం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. HCA జిల్లా జట్టులో రాణిస్తున్న అరుణ్ కుమార్ తన ప్రతిభతో సిరీస్ కు ఎంపికయ్యారు.