సెప్టెంబర్ 19 లోగా ఓటరు జాబితా సవరణ
జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వికారాబా జిల్లాప్రతినిధి , మేజర్ న్యూస్ (ఆగస్టు 31): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. అనామలీస్, నాన్-మ్యాపింగ్ ఓటర్లకు సంబంధించిన పత్రాలను హియరింగ్కు ముందే బీఎల్వోలు యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. హియరింగ్కు హాజరైన ఓటర్లు, అధికారుల గ్రూప్ ఫొటో, హాజరు పట్టికను కూడా యాప్లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియను సెప్టెంబర్ 19లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ స్వర్ణలత, జడ్పీ సీఈఓ సుధీర్, ఎన్నికల విభాగం అధికారి నెమత్ హాలీ తదితరులు పాల్గొన్నారు.