BREAKING
సౌకర్యాల బాధ్యత నాది.. చదువు బాధ్యత మీది!” బాలిక సంరక్షణ అందరి బాధ్యత --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు పి. మేరీ ఎంపిక మహిళల ఆసియా కప్‌లో భారత్ జోరు.. థాయ్‌లాండ్‌పై 94 పరుగుల ఘన విజయం! ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇరాన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బంధం మరింత బలోపేతం చేయాలని పెజెష్కియన్ పిలుపు! సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక భారత్–ఉజ్బెకిస్థాన్ బంధంలో బిగ్ డీల్.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలక అడుగు! భారత ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. GDP 7.8%! నేపాల్‌ను ముంచేసిన వరద బీభత్సం.. 903కి చేరిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు! తుక్కుగూడలో నర్సు మృతి కేసు కలకలం.. అనుమానాస్పద ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం! వెలిగొండకు సీఎం చంద్రబాబు కీలక శుభవార్త.. ఫేజ్-1 ప్రారంభం, 10.70 TMC కృష్ణా జలాల విడుదల! ఒంటరి మహిళలే టార్గెట్.. అంతర్రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్ ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ యుద్ధ మంటలు.. దాడులకు ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తత! వైభవ్ సూర్యవంశీ సంచలన రికార్డు.. 15 ఏళ్లకే దులీప్ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు!

సౌకర్యాల బాధ్యత నాది.. చదువు బాధ్యత మీది!”

Select Suryaa Now
సౌకర్యాల బాధ్యత నాది.. చదువు బాధ్యత మీది!”

సౌకర్యాల బాధ్యత నాది.. చదువు బాధ్యత మీది!”
విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా
 

హుస్నాబాద్,; విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో బాల, బాలికల హాస్టళ్ల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “సౌకర్యాలు కల్పించే బాధ్యత నాది.. వాటిని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరే బాధ్యత మీది” అని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల వసతి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కెడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.