భారత్–ఉజ్బెకిస్థాన్ బంధంలో బిగ్ డీల్.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలక అడుగు!
భారత్–ఉజ్బెకిస్థాన్ బంధంలో కొత్త అధ్యాయం
భారత్–ఉజ్బెకిస్థాన్ సంబంధాలు మరో కీలక దశకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన చర్చల అనంతరం రెండు దేశాల సంబంధాలను Comprehensive Strategic Partnership స్థాయికి పెంచాలని నిర్ణయించారు.
వాణిజ్యానికి భారీ టార్గెట్
రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత వేగవంతం చేయాలని నేతలు నిర్ణయించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, కనెక్టివిటీ రంగాల్లోనూ సహకారం పెంచే దిశగా చర్చలు జరిగాయి.
యురేనియం సరఫరాపై కీలక అడుగు
ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశాల్లో యురేనియం సరఫరా ఒకటి. భారత అణు ఇంధన అవసరాలకు ఉపయోగపడేలా ఉజ్బెకిస్థాన్ నుంచి దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఏర్పాటుపై రెండు దేశాలు ముందుకు సాగాయి. ఇది భారత్ ఇంధన భద్రతకు వ్యూహాత్మకంగా కీలకంగా మారే అవకాశం ఉంది.
రక్షణ, భద్రతలో మరింత సహకారం
రక్షణ రంగంలోనూ ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ సహకారం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సమన్వయాన్ని పెంచేందుకు ఇరు దేశాలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి.
టెక్నాలజీ నుంచి కీలక ఖనిజాల వరకు
AI, డిజిటల్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు భారత్–ఉజ్బెకిస్థాన్ ఆసక్తి చూపుతున్నాయి. మధ్య ఆసియాలో భారత్ తన ఆర్థిక, వ్యూహాత్మక అనుబంధాలను మరింత బలపరచుకునే ప్రయత్నంలో ఇది ముఖ్యమైన పరిణామంగా కనిపిస్తోంది.