BREAKING
మహిళల ఆసియా కప్‌లో భారత్ జోరు.. థాయ్‌లాండ్‌పై 94 పరుగుల ఘన విజయం! ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇరాన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బంధం మరింత బలోపేతం చేయాలని పెజెష్కియన్ పిలుపు! సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక భారత్–ఉజ్బెకిస్థాన్ బంధంలో బిగ్ డీల్.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలక అడుగు! భారత ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. GDP 7.8%! నేపాల్‌ను ముంచేసిన వరద బీభత్సం.. 903కి చేరిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు! తుక్కుగూడలో నర్సు మృతి కేసు కలకలం.. అనుమానాస్పద ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం! వెలిగొండకు సీఎం చంద్రబాబు కీలక శుభవార్త.. ఫేజ్-1 ప్రారంభం, 10.70 TMC కృష్ణా జలాల విడుదల! ఒంటరి మహిళలే టార్గెట్.. అంతర్రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్ ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ యుద్ధ మంటలు.. దాడులకు ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తత! వైభవ్ సూర్యవంశీ సంచలన రికార్డు.. 15 ఏళ్లకే దులీప్ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు! HDFC Bankలో కీలక పరిణామం.. CEO రేసు నుంచి జగదీశన్ తప్పుకోవడంతో షేరుపై ఫోకస్! స్టాక్ మార్కెట్లకు మళ్లీ నష్టాల షాక్.. 24 వేల దిగువకు నిఫ్టీ జారేనా? సెన్సెక్స్‌లోనూ ఒత్తిడి! స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. ఫెడ్ రేట్ల టెన్షన్‌తో ఇన్వెస్టర్లలో అలజడి!

సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Select Suryaa Now
సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
సదాశివపేట: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ తెలిపారు. సోమవారం నిర్వహించిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా ఆరోగ్యం, మౌలిక వసతులు, సుందరీకరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు, ఎన్.హెచ్-65 బైపాస్ టౌన్ ఎంట్రన్స్ వద్ద భారీ జాతీయ జెండా ఏర్పాటు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపట్టనున్నారు. వినాయక నిమజ్జనం, దసరా, బతుకమ్మ పండుగలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.మున్సిపాలిటీలో పనిచేస్తున్న 125 మంది పారిశుద్ధ్య కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ఆమోదం తెలిపారు. మరో 105 మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు శాశ్వత గుర్తింపు కార్డులు అందించనున్నారు. పారిశుద్ధ్య పరికరాలు, దోమల నివారణ స్ప్రే మెషిన్లు, అదనంగా ఒక జేసీబీ కొనుగోలుకు కూడా జనరల్ బాడీ ఆమోదం తెలిపింది.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.