BREAKING
సౌకర్యాల బాధ్యత నాది.. చదువు బాధ్యత మీది!” బాలిక సంరక్షణ అందరి బాధ్యత --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు పి. మేరీ ఎంపిక మహిళల ఆసియా కప్‌లో భారత్ జోరు.. థాయ్‌లాండ్‌పై 94 పరుగుల ఘన విజయం! ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇరాన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బంధం మరింత బలోపేతం చేయాలని పెజెష్కియన్ పిలుపు! సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక భారత్–ఉజ్బెకిస్థాన్ బంధంలో బిగ్ డీల్.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలక అడుగు! భారత ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. GDP 7.8%! నేపాల్‌ను ముంచేసిన వరద బీభత్సం.. 903కి చేరిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు! తుక్కుగూడలో నర్సు మృతి కేసు కలకలం.. అనుమానాస్పద ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం! వెలిగొండకు సీఎం చంద్రబాబు కీలక శుభవార్త.. ఫేజ్-1 ప్రారంభం, 10.70 TMC కృష్ణా జలాల విడుదల! ఒంటరి మహిళలే టార్గెట్.. అంతర్రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్ ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ యుద్ధ మంటలు.. దాడులకు ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తత! వైభవ్ సూర్యవంశీ సంచలన రికార్డు.. 15 ఏళ్లకే దులీప్ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు!

బాలిక సంరక్షణ అందరి బాధ్యత --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

Select Suryaa Now
బాలిక సంరక్షణ అందరి బాధ్యత  --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

బాలిక సంరక్షణ అందరి బాధ్యత 
--జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

భేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో  ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించడం జరిగింది.

 మెదక్ ; రాఖీ పౌర్ణమి సందర్భంగా బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులు జిల్లా కలెక్టర్ తోపాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు రాఖీలు కట్టి, బాలికల రక్షణ, విద్య, సమానత్వం మరియు సాధికారతకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలనే సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..బాలికల హక్కులు, భద్రత, విద్య  భవిష్యత్ అభివృద్ధికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి విద్యను ప్రోత్సహించడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.రాఖీ వేడుకల ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు బాలికల భద్రత గౌరవాన్ని కాపాడాలనే సామాజిక బాధ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం  చేయాలన్నారు.కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొని “బాలికలను రక్షిద్దాం – బాలికలను చదివిద్దాం” అనే  సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమా భార్గవి,బాలికలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.