జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు పి. మేరీ ఎంపిక
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు పి. మేరీ ఎంపిక
2 గోల్డ్ మెడల్స్ సాధించిన మేరీ
సంగారెడ్డి ; మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఎన్.పి.ఆర్.డి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి. మేరీ సత్తా చాటారు. డిస్కస్ త్రో, 3000 మీటర్ల వాక్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. దీంతో అక్టోబర్ రెండో వారంలో తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.
జాతీయ పోటీల్లోనూ పతకం సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకువస్తానని మేరీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. తనలాంటి క్రీడాకారులను వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిరంతరం ప్రోత్సహిస్తోందని ఆమె పేర్కొన్నారు.