కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజల అండగా ' సమరభేరి' ...ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సూర్య, హుజురాబాద్.
అలవి కాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలన తో ఇబ్బందులు పడుతున్న విసిగిపోయిన ప్రజలకు అండగా మేమున్నామంటూ బి.ఆర్.ఎస్. సమరభేరి చేపడుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ లో ఆయన మాట్లాడుతూ....
తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దానిని నిరసిస్తూ వారం రోజులపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోజుకు ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 2 నుండి 8 వరకు ప్రతిరోజు ఒక అంశంపై నిరసన కార్యక్రమాలు చివరి రోజున జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల అసంతృప్తిని ఈ సమరభేరి ద్వారా తెలంగాణ ప్రజలకు తేటతెల్లo చేస్తామని అన్నారు.