మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
సూర్య తిమ్మాపూర్:
మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని నేతాజీ యూత్ సభ్యులు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామంలో శనివారం గాంధీ విగ్రహం వద్ద నేతాజీ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, నేతాజీ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.