BREAKING
కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం రోష్ హషానా సందర్భంగా నెతన్యాహు, యూదు సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్ కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం జాతీయ లోక్ అదాలత్తో త్వరితగతిన కేసుల పరిష్కారం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం పరిపక్వ దశకు బ్రిక్స్ కూటమి భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్. వర్ధమాన రంగాల్లో భారత్-యూఏఈ భాగస్వామ్యం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం

దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం

Select Suryaa Now
దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం

దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం 

అభివృద్ధి సంక్షేమానికి కేరాఫ్ టిడిపినే.

గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం పెద్ద పీట. 

 డైవర్ట్ పాలిటిక్స్, అసత్యాలు ప్రచారం చేయడమే గొడ్డలి పార్టీ ధ్యేయం. 

శంకరాపురానికే మణిహారం కానున్న చెరువు. 

చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. 

 

ముండ్లమూరు మేజర్ న్యూస్. రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన మెరుగుగా ఉందని, ప్రగతి  పరిగెడుతుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ప్రజలకు అందిస్తుందని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.

శంకరాపురం గ్రామం లో 50 లక్షల రూపాయలతో జరుగుతున్న చెరువు కట్ట నిర్మాణ పనులను గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఒకవైపు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నాడని ఆమె అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. డైవర్ట్ పాలిటిక్స్, అసత్యాల ను ప్రచారం చేయడమే గొడ్డలి పార్టీ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు . గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదన్నారు. జగన్ పాలనలో దోచుకోవడం దాచుకోవడం సిద్ధాంతంగా పనిచేశారన్నారు. చెరువు అభివృద్ధి పనులను పరిశీలించి వివరాలను అధికారులను అడిగి డాక్టర్ లక్ష్మీ తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధిలో భాగంగా చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ , లైటింగ్ ,ఆర్ సి సి బెంచీలు ,పార్కు, ఓపెన్ జిమ్, కట్టకు రీవట్మెంటు, తదితర పనులను చేయనున్నారు. ఈ కార్యక్రమంలోమండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రామయ్య, తాజా మాజీ సర్పంచ్ నారాయణ స్వామి, ఏఈ సుధాకర్ ఏపిడి చంద్రశేఖర్ రెడ్డి,

స్థానిక నాయకులు పాల్గొన్నారు.