కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్.
కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్
ఐదు లక్షల బీమా చెక్కును అందజేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
కార్యకర్తల భద్రతకు టిడిపి పెద్దపీట.
టిడిపి కార్యకర్తకు అండగా తెలుగుదేశం పార్టీ ప్రమాద భీమా.
ముండ్లమూరు, మేజర్ న్యూస్ :
కార్యకర్తల భద్రతకు తెలుగుదేశం పార్టీ అత్యున్నత ప్రాధాన్యతనిచ్చిందని, దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కాత్ కార్యకర్తల సంక్షేమానికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో టిడిపి కార్యకర్త గంగినేని శ్రీనివాసరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా అతని కుటుంబ సభ్యులకు ఐదు లక్షల నగదు చెక్కును డాక్టర్ లక్ష్మీ అందజేశారు. టిడిపి సభ్యత్వం పొంది ఉన్నారు అందుచే వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కుని మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని నగదు చెక్కును డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మాజీ మండలం ఎంపీపీ మందలపు వెంకటరావు, తాజా మాజీ సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి టిడిపి నాయకులు మందలపు తిరుపతిరావు గ్రామ పార్టీ అధ్యక్షులు గమిడి హనుమంతరావు , దిరిశాల శ్రీనివాసరావుస్థానిక నాయకులు పాల్గొన్నారు.