తిరుమల బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు
తిరుమల బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు.... వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.....
పెండ్లిమర్రి, మేజర్ న్యూస్...
ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వ్యాఖ్యాత, ప్రవచనకర్త, ఆధ్యాత్మిక రచయిత అయినటువంటి డాక్టర్ ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు కు ఈనెల 15 నుండి 23 వరకు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయుటకు టీటీడీ అధికారుల ఆహ్వానం అందుకున్నారు.. ఈనెల 15వ తేదీ రాత్రి జరిగే పెద్ద శేష వాహన సేవ, 16వ తేదీ ఉదయం జరిగే చిన్న శేష వాహన సేవలకు తిరుమల మాడవీధులలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పక్షాన వ్యాఖ్యానం చేయనున్నారు... అలాగే ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం జరిగే రాత్రి జరిగే చంద్రప్రభ వాహన సేవలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ టీవీలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు.
42 ఆధ్యాత్మిక గ్రంథాలను 12 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చరిత్ర పాఠ్యపుస్తకాలు రచించారు. వేలాది వ్యాసాలు వివిధ పత్రికల్లో రాసిన ఆయన తిరుమల తిరుపతి తిరుచానూరు శ్రీశైలం ఒంటిమిట్ట క్షేత్రాలలో వివిధ ఉత్సవాల సమయంలో ప్రవచనాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేయడంతో పాటు వివిధ వాహన సేవలు, కల్యాణోత్సవం వంటి సేవలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. వీరికి శ్రీశైలం నుంచి ఆహ్వానం రావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కడప సాహితీవేత్తలు అభినందనలు తెలపడం విశేషం...