అప్రకటిత కరెంట్ కోతలు. సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా
యర్కారం సబ్స్టేషన్ ముట్టడి, రాస్తారోకో!
సూర్యాపేట మండలంలో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని యర్కారం సబ్స్టేషన్ ముట్టడించి రాస్తారోకో చేసిన రైతులు. 5 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్. సూర్యాపేట మండల పరిధిలో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు యర్కారం సబ్ స్టేషన్ ను ముట్టడించి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కరెంట్ లేక బోరుబావుల కింద పంటలు ఎండిపోతున్నా అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ రాస్తారోకోతో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్నరూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.