BREAKING
సింగరేణి నుంచి బంగారు వేటకు బిగ్ ప్లాన్.. హట్టి గోల్డ్ మైన్స్‌తో జాయింట్ వెంచర్‌పై ఫోకస్! LoC సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో MCAలో స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం ఓటరు జాబితాపై రీ-వెరిఫికేషన్.. హైదరాబాద్‌లో ఇక రాత్రివేళ ప్రయాణం ఈజీ.. నైట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్! ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం రసాయన శాస్త్రంలో కిరణ్ కుమార్ కు పీహెచ్.డీ.... దేశవ్యాప్తంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి! J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి చార్మినార్ బస్‌స్టాండ్‌ వద్ద తెల్లవారుజామున మంటలు.. అసలేం జరిగిందంటే? డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలి కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే

లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ

Select Suryaa Now
లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ
లక్షెట్టిపేట, ఆగస్టు 29, సూర్య మేజర్ న్యూస్ : 
 
జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు జనసేన కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ తెలిపారు.
దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ ప్రాంతాలకు చెందిన జనసైనికులతో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తల భాగస్వామ్యం, స్థానిక సమస్యలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి మరియు అదిలాబాద్ కోఆర్డినేటర్ రాజ్ కిరణ్ పిలుపునిచ్చారు.
ఇకపై లక్షెట్టిపేటను కేంద్రంగా చేసుకుని జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, స్థానిక రాజకీయాల్లో పార్టీకి బలమైన స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, పార్టీ అభివృద్ధికి అవసరమైన పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు రక్షిత్ వర్మ మాట్లాడుతూ, లక్షెట్టిపేట కేంద్రంగా రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకోనుందని అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలిచి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో చింతల రంజిత్, బియ్యాల దినేష్ వర్మ, రాచర్ల రాకేష్, కొత్తపల్లి సాయి, ఆవునూరు కిరణ్, మహమ్మద్ సమీర్, సుద్దాల సూర్య, కిషోర్, వెంకటేష్, సిద్దు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.