BREAKING
దేశవ్యాప్తంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి! J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి చార్మినార్ బస్‌స్టాండ్‌ వద్ద తెల్లవారుజామున మంటలు.. అసలేం జరిగిందంటే? డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలి కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మళ్లీ మారనున్న వాతావరణం! 900 గజాలు-200 రకాలకు పైగా మొక్కలు,చెట్లు ఇది వల్లభనేని కుమార స్వామి ఘనత బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు డేట్ ఫిక్స్.. కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్‌గా అదిరిపోయే అనౌన్స్‌మెంట్! ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ! కార్పొరేట్ రుణ పరిష్కారాలు.. బ్యాంకింగ్ సంక్షోభంపై పెరుగుతున్న ప్రజా చర్చ మహేంద్రగిరి వారాహి రివ్యూ: సుమంత్ నటన ఎలా ఉంది? హీరోయిన్ ఏమన్నారంటే? శ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి! బంగారం ధరల్లో స్వల్ప మార్పు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేటి గోల్డ్ రేట్లు ఇవే! భార్య లేకుండానే సక్సెస్ సాధించొచ్చా? ఆర్జీవీ వైరల్ పోస్ట్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? నేటి సర్వదర్శనం టైమింగ్స్ ఇవే.. పూర్తి వివరాలు!

J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Select Suryaa Now
J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

పత్రికా ప్రకటన
తేది: 29-08-2026
మహబూబ్‌నగర్

*జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్*


జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, పారిశుద్ధ్య, పౌర సేవల కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

శనివారం అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో జడ్చర్ల మున్సిపాలిటీకి చెందిన అధికారులు, సిబ్బందితో ఆయన  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వివిధ విభాగాల పనితీరు, ఆయా విభాగాల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిని విభాగాల వారీగా సమీక్షించారు.

మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల స్థితిగతులు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణ, ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలు, పన్నులు తదితర ఆదాయ వసూళ్ల పురోగతి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు మున్సిపల్ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

అదేవిధంగా మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పన్నులు, ఇతర ఆదాయ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులను నిర్దేశిత ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రతి విభాగం తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధి ,  ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు.