BREAKING
J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి చార్మినార్ బస్‌స్టాండ్‌ వద్ద తెల్లవారుజామున మంటలు.. అసలేం జరిగిందంటే? డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలి కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మళ్లీ మారనున్న వాతావరణం! 900 గజాలు-200 రకాలకు పైగా మొక్కలు,చెట్లు ఇది వల్లభనేని కుమార స్వామి ఘనత బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు డేట్ ఫిక్స్.. కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్‌గా అదిరిపోయే అనౌన్స్‌మెంట్! ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ! కార్పొరేట్ రుణ పరిష్కారాలు.. బ్యాంకింగ్ సంక్షోభంపై పెరుగుతున్న ప్రజా చర్చ మహేంద్రగిరి వారాహి రివ్యూ: సుమంత్ నటన ఎలా ఉంది? హీరోయిన్ ఏమన్నారంటే? శ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి! బంగారం ధరల్లో స్వల్ప మార్పు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేటి గోల్డ్ రేట్లు ఇవే! భార్య లేకుండానే సక్సెస్ సాధించొచ్చా? ఆర్జీవీ వైరల్ పోస్ట్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? నేటి సర్వదర్శనం టైమింగ్స్ ఇవే.. పూర్తి వివరాలు! రాఖీ కట్టనంక.. వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్!

కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే

Select Suryaa Now
కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే


రైతుల పొలాల వద్దకు వాలంటీర్లు.. పంట వివరాల డిజిటల్ నమోదు
జియో ట్యాగింగ్‌తో ఖచ్చితమైన సమాచారం.. రైతులు సహకరించాలి : ఈఓ గణేశ్

సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి....కొండాపూర్ మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని రైతుల పొలాలను వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ పంటల వివరాలను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు.సాగు విస్తీర్ణం, పంట రకం, సాగు పరిస్థితులు తదితర వివరాలను పరిశీలించి జియో ట్యాగింగ్‌తో డిజిటల్‌గా నమోదు చేస్తున్నట్లు ఈఓ గణేశ్ తెలిపారు. ప్రతి రైతు సాగు చేస్తున్న పంటకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా నమోదైతే భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాల అమలు, పంటల ప్రణాళిక, వ్యవసాయ విధానాల రూపకల్పనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

రైతులు పూర్తి వివరాలు అందించాలి..

రైతుల పొలాల వద్దకు వచ్చే డిజిటల్ క్రాప్ సర్వే వాలంటీర్లకు రైతులు అవసరమైన సమాచారాన్ని అందించి సర్వే ప్రక్రియకు సహకరించాలని ఈఓ గణేశ్ కోరారు. పంటల వివరాల నమోదు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తమ పొలాల్లో సాగు చేస్తున్న పంటలను సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమం ద్వారా మండలంలో సాగు విస్తీర్ణం, వివిధ పంటల సాగు పరిస్థితులపై ఖచ్చితమైన డిజిటల్ సమాచారం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.