BREAKING
క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం ఓటరు జాబితాపై రీ-వెరిఫికేషన్.. హైదరాబాద్‌లో ఇక రాత్రివేళ ప్రయాణం ఈజీ.. నైట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్! ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం రసాయన శాస్త్రంలో కిరణ్ కుమార్ కు పీహెచ్.డీ.... దేశవ్యాప్తంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి! J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి చార్మినార్ బస్‌స్టాండ్‌ వద్ద తెల్లవారుజామున మంటలు.. అసలేం జరిగిందంటే? డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలి కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మళ్లీ మారనున్న వాతావరణం! 900 గజాలు-200 రకాలకు పైగా మొక్కలు,చెట్లు ఇది వల్లభనేని కుమార స్వామి ఘనత బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు డేట్ ఫిక్స్.. కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్‌గా అదిరిపోయే అనౌన్స్‌మెంట్! ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ! కార్పొరేట్ రుణ పరిష్కారాలు.. బ్యాంకింగ్ సంక్షోభంపై పెరుగుతున్న ప్రజా చర్చ

ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

Select Suryaa Now
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

లక్షెట్టిపేట :ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను మంచిర్యాల జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ తో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రికి సురక్షితంగా తరలించేందుకు ఈ వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు..
పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తుందని తెలిపారు.. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి, వైద్యులతో మాట్లాడి పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో డాక్టర్లు , సంబంధిత అధికారులు, మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..