2030 నాటికి 8 గిగావాట్లకు దేశీయ డేటా సెంటర్ సామర్థ్యం
న్యూఢిల్లీ: వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఏఐ వినియోగం నేపథ్యంలో భారతదేశ డేటా సెంటర్ విద్యుత్ సామర్థ్యం భారీగా పెరుగుతోంది. 2020లో 375 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యం ఆగస్టు 2026 నాటికి 1.57 గిగావాట్లకు చేరగా, 2030 నాటికి ఇది 8 గిగావాట్లకు (GW) పెరుగుతుందని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్లకు మౌలిక సదుపాయాల హోదా కల్పించడంతో పాటు 2047 వరకు పన్ను మినహాయింపులు ప్రకటించింది. ఇప్పటికే ఈ రంగంలో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, మరో 90 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులు ఖరారయ్యాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు గ్రీన్ ఎనర్జీ, లిక్విడ్ కూలింగ్ వంటి హరిత సాంకేతికతలను ప్రోత్సహిస్తున్నారు.