వ్యర్థ ఉష్ణాన్ని విద్యుత్తుగా మార్చే కొత్త ఆవిష్కరణ
బెంగళూరు: పారిశ్రామిక వ్యర్థ ఉష్ణాన్ని విద్యుత్తుగా మార్చే ప్రక్రియలో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. థాలియం కాపర్ సెలెనైడ్ (TlCu5Se3) అనే స్ఫటికాకార పదార్థంలో అసాధారణ తరంగ-వంటి ఉష్ణ రవాణా యంత్రాంగాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఈ పదార్థంలోని రాగి పరమాణువుల పరిమిత చలనం వల్ల ఉష్ణ రవాణా వేగవంతమై, 1.7 థర్మోఎలెక్ట్రిక్ ఫిగర్ ఆఫ్ మెరిట్ (zT) లభించినట్లు ప్రొఫెసర్ కనిష్క బిస్వాస్ బృందం వెల్లడించింది. సిమెంట్, ఉక్కు పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్లు, ఆటోమొబైల్స్ మరియు డేటా సెంటర్ల నుండి వెలువడే వ్యర్థ ఉష్ణాన్ని పునరుద్ధరించడానికి, అలాగే బ్యాటరీ ఉష్ణ నిర్వహణకు ఈ సాంకేతికత ఎంతగానో దోహదపడనుంది.