BREAKING
ముద్రా లబ్ధిదారులకు ఆర్థిక అక్షరాస్యతను పెంచాలి: సీతారామన్ భారత్-అమెరికా టెక్ సంబంధాలను కొనియాడిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల టోక్యోలో క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియాకు ఘన స్వాగతం టెక్‌బాల్‌లో క్విమ్సీ సెమీఫైనల్‌కి దూసుకెళ్లింది సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశ ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత మహిళల క్రికెట్ జట్టు బోణీ చైనీస్ తైపీ చేతిలో భారత పురుషుల సాఫ్ట్ టెన్నిస్ జట్టు ఓటమి ప్రధాని మోదీ ప్రోత్సాహం కళాకారులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఉజ్జయినిలో గిన్నిస్ రికార్డు వినాయక నిమజ్జనానికి నీటి తిప్పలు.. ఎండిపోయిన చెరువులతో భక్తుల ఆవేదన లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు భారత్-నేపాల్ మధ్య వాణిజ్య, అనుసంధాన చర్చలు ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో భారత్‌కు అగ్రస్థానం: ఇంటెల్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తేలికపాటి వర్ష సూచన లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌కు ఆసియా క్రీడలే కీలక మైలురాయి: కోచ్ రెబౌల్

చైనీస్ తైపీ చేతిలో భారత పురుషుల సాఫ్ట్ టెన్నిస్ జట్టు ఓటమి

Select Suryaa Now
చైనీస్ తైపీ చేతిలో భారత పురుషుల సాఫ్ట్ టెన్నిస్ జట్టు ఓటమి

టెక్‌బాల్‌లో క్విన్సీ సెమీస్‌కు
నగోయా: ఆసియా క్రీడల్లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-సి ప్రాథమిక రౌండ్ మ్యాచ్‌లో భారత పురుషుల సాఫ్ట్ టెన్నిస్ జట్టు చైనీస్ తైపీ చేతిలో 0-3 తేడాతో ఓటమి పాలైంది. డబుల్స్ విభాగంలో జై మీనా-యోగేష్ చౌదరి జంట, సింగిల్స్‌లో ఆర్యన్ ఠాకూర్, ఆపై రెండో డబుల్స్‌లో అనికేత్ పటేల్-ఓమ్ యాదవ్ జోడీ పరాజయం పాలయ్యారు. కాగా భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో మంగోలియాపై విజయం సాధించి పుంజుకోవాలని భావిస్తోంది.

మరోవైపు ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసిన టెక్‌బాల్ క్రీడలో భారత అథ్లెట్ క్విన్సీ జోవాక్విమ్ డిసౌజా అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎ విభాగంలో వరుసగా జపాన్ అథ్లెట్ యుయినా సకమోటోపై 2-1తోనూ, కంబోడియాకు చెందిన కోమ్‌యెన్ డివైపై 2-0తోనూ ఘనవిజయాలు సాధించి నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సింగిల్స్‌లో మెరిసిన క్విన్సీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో మహ్మద్ అనస్ ఇమ్రాన్ బెగ్‌తో కలిసి ఫిలిప్పీన్స్ జోడీతో తలపడనుంది.