లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్కు ఆసియా క్రీడలే కీలక మైలురాయి: కోచ్ రెబౌల్
న్యూఢిల్లీ: లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా జపాన్లోని ఐచి-నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలు భారత సర్ఫింగ్ రంగానికి అత్యంత కీలకమైన అడుగు అని భారత ప్రధాన సర్ఫింగ్ కోచ్ సమై రెబౌల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడలలో సర్ఫింగ్ పోటీలు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాగా, షార్ట్బోర్డ్ విభాగంలో భారత్ తరఫున ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళా సర్ఫర్లు పోటీపడనున్నారు. ఈ పోటీలు నేరుగా లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోటా స్థానాలను కూడా ఖరారు చేయనున్నాయి.
భారత్లో చిన్న వయస్సు నుంచే సర్ఫర్లను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు ఒక స్థిరమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ప్రకటనలో రెబౌల్ తెలిపారు. ఆసియా క్రీడల్లో గట్టి పోటీని ఎదుర్కొనేందుకు నిరంతర అంతర్జాతీయ అనుభవం అవసరమని, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి బలమైన జట్లకు సవాలు విసిరేలా భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారని ఆయన వెల్లడించారు.