BREAKING
30 లక్షల మంది నమోదుతో ‘పీఎం విశ్వకర్మ’ మూడేళ్లు పూర్తి అసంక్రమిత వ్యాధులపై ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చట్టానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం అఫ్గానిస్థాన్‌పై భారత్ క్లీన్ స్వీప్ కిష్టాపురం గురుకులంలో టిడి టీకా శిబిరం పరిశీలన శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు ఇరాన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌పై అమెరికా ఆంక్షలు పోలాండ్‌లో అమెరికా సైనిక స్థావరం: ట్రంప్ ప్రకటన సాంస్కృతిక సారధి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి శ్రీకాంత్, కార్యదర్శిగా మేడిపల్లి వేణు చమురు ధరల తగ్గింపుతో ఆసియా మార్కెట్లలో ఉత్సాహం డీజేలకు అనుమతులపై మంత్రి నారా లోకేష్‌ కీలక స్పందన ఏషియన్ గేమ్స్ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత మహిళా క్రికెట్ జట్టు - నేడు జపాన్‌తో క్వార్టర్ ఫైనల్ పోరు భూటాన్ రాజుతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ

శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్

Select Suryaa Now
శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్

కార్డిఫ్:గురువారం సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో సొంతం చేసుకుంది. టీ20 క్రికెట్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్‌కు ఇది వరుసగా 14వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ తన కెరీర్‌లో 15,000 టీ20 పరుగులు పూర్తి చేసి, ఈ మైలురాయిని చేరుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక (37) రాణించినప్పటికీ, ఇంగ్లండ్ స్పిన్నర్ లియామ్ డాసన్ (3/32), ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (2/34), సోనీ బేకర్ (1/15) ధాటికి శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, టామ్ బాంటన్ (52 నాటౌట్) అర్ధశతకంతో విరుచుకుపడటంతో కేవలం 12.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డాసన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది. సిరీస్‌లోని చివరి టీ20 శనివారం మాంచెస్టర్‌లో జరగనుంది.