డీజేలకు అనుమతులపై మంత్రి నారా లోకేష్ కీలక స్పందన
డీజేలకు అనుమతులపై మంత్రి నారా లోకేష్ కీలక స్పందన
- హోంమంత్రి, డీజీపీకి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి
- పామూరులో వినాయక మండపాల నిర్వాహకుల హర్షం
- పామూరు, సూర్య ప్రతినిధి :
పామూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకులు డీజేలకు అనుమతుల విషయంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక నిమజ్జనాల వేళ డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. పోలీసుల నుంచి పర్మిషన్లు ఇవ్వడం లేదని తన దృష్టికి వస్తున్న మెసేజీలను ప్రస్తావిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజేలకు అనుమతులు ఇవ్వాలని హోంమంత్రి అనిత, డీజీపీని కోరారు. ఒక్క డీజే వాహనం కూడా సీజ్ కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పామూరు మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన ప్రజలు మంత్రి నారా లోకేష్కు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.