BREAKING
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చట్టానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం అఫ్గానిస్థాన్‌పై భారత్ క్లీన్ స్వీప్ కిష్టాపురం గురుకులంలో టిడి టీకా శిబిరం పరిశీలన శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు ఇరాన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌పై అమెరికా ఆంక్షలు పోలాండ్‌లో అమెరికా సైనిక స్థావరం: ట్రంప్ ప్రకటన సాంస్కృతిక సారధి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి శ్రీకాంత్, కార్యదర్శిగా మేడిపల్లి వేణు చమురు ధరల తగ్గింపుతో ఆసియా మార్కెట్లలో ఉత్సాహం డీజేలకు అనుమతులపై మంత్రి నారా లోకేష్‌ కీలక స్పందన ఏషియన్ గేమ్స్ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత మహిళా క్రికెట్ జట్టు - నేడు జపాన్‌తో క్వార్టర్ ఫైనల్ పోరు భూటాన్ రాజుతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ ఐఏఎఫ్, పవన్ హన్స్‌లకు హెచ్‌ఏఎల్ విమానాలు, హెలికాప్టర్ల అందజేత ఉపాధ్యాయుల కోసం ప్రహ్లాద్ జోషి బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం

మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు

Select Suryaa Now
మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు

 

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా వికారాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాత బాల భక్త సమాజం ఆధ్వర్యంలో గణేష్ కట్ట మైసమ్మ గుడి, శివాజీ నగర్‌లోని వినాయక మండపం వద్ద గురువారం రాత్రి దీపాలు వెలిగించి ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు టి. సదానంద రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కాలనీవాసులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ ఆయురారోగ్యాలతో దేశానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్, తెలంగాణ హిందూ జనశక్తి అధ్యక్షులు శ్రీనివాస్, వికారాబాద్ మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, ఆధ్యాత్మిక సెల్ కన్వీనర్ ప్రవీణ్, నర్సింలు, భాస్కర్ రెడ్డి, డాక్టర్ స్వప్న, స్వాతి తదితరులతో పాటు కాలనీవాసులు, పిల్లలు పాల్గొన్నారు.