లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
23,300 దాటిన నిఫ్టీ
ముంబై:ముడి చమురు ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో శుక్రవారం భారతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 170 పాయింట్లకు పైగా లాభపడి 74,485 వద్ద ట్రేడవుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 23,300 మార్కును దాటింది. రంగాల వారీగా నిఫ్టీ రియల్టీ సూచీ అత్యధికంగా 1.24 శాతం లాభపడగా, ఐటీ రంగానికి చెందిన షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
ఎల్ఆండ్టీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనించగా.. ఇన్ఫోసిస్, టిసిఎస్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో మునిగాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి బ్యారెల్కు 103 డాలర్ల వద్ద ట్రేడ్ అవ్వడం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం భారత మార్కెట్లకు కలసివచ్చే అంశమని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం నిఫ్టీకి 23,300 నుండి 23,400 స్థాయి తక్షణ నిరోధక జోన్గా ఉంటుందని, ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల హడావుడి వల్ల లార్జ్-క్యాప్ స్టాక్స్ ఆకర్షణీయమైన ధరల్లో దొరుకుతున్నాయని విశ్లేషకులు వెల్లడించారు.