BREAKING
విజయ్ దేవరకొండ 'రణబాలి' టీజర్ అప్డేట్ వచ్చేసింది డ్రగ్స్‌ కేసులో టీవీ ప్రజెంటర్‌ సహా 12 మందికి మరణ శిక్ష నిర్మాతల మండలి ఎన్నికల్లో మోహన్ వడ్లపట్ల విజయం ‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ మెరిసే సాంగ్ విడుదల సరిహద్దు గ్రామాల ప్రగతికి ప్రాణవాయువు 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్' గోల్డ్ స్పాట్ గ్లింప్స్ విడుదల “ఈ పదవి మహిళలు లభించిన గౌరవం” ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడంలో వ్యాపారాలకు ప్రభుత్వ మద్దతుతో కూడిన రుణాలు ముఖ్యమంత్రి దృష్టి బొమ్మ దగ్ధం... శ్రీధర్ గాదె కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం రూ. 1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ ఆమోదం ‘చెప్పారంటే చేసి చూపిస్తారు’ నర్సాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన 1,000 రోజుల విజయోత్సవ వికాస్ యాత్ర IT, మెటల్, PSU బ్యాంక్ షేర్ల పతనంతో నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ '90s' వెబ్ సిరీస్ మేజిక్ రిపీట్ చేసేందుకు ఆదిత్య హాసన్ సిద్ధం

డ్రగ్స్‌ కేసులో టీవీ ప్రజెంటర్‌ సహా 12 మందికి మరణ శిక్ష

Select Suryaa Now
డ్రగ్స్‌ కేసులో టీవీ ప్రజెంటర్‌ సహా 12 మందికి మరణ శిక్ష

కైరో: ఈజిప్టులో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో 12 మందికి కోర్టు మరణ శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో ప్రముఖ టీవీ ప్రజెంటర్‌ సారా ఖలీఫా (39) కూడా ఉన్నారు. నిందితులను ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. మరో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించగా.. ఏడుగురిని కేసు నుంచి విడుదల చేసింది.పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు విదేశాల నుంచి డ్రగ్స్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అక్రమంగా దిగుమతి చేసుకుని, వాటితో నిషేధిత మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితుల వద్ద అక్రమ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో మరణ శిక్ష పడిన సారా ఖలీఫా.. నేరాలకు సంబంధించిన వార్తలను ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ పేరుతో టీవీలో ప్రజెంట్‌ చేసేవారని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్‌ తయారీ, అక్రమ ఆయుధాల వ్యవహారంలో ఆమెకు కూడా సంబంధం ఉన్నట్లు ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. వాస్తవానికి ఈ కేసులో శిక్షలను గత నెలలోనే కోర్టు ప్రకటించినట్లు సమాచారం. అయితే ఈజిప్టు న్యాయ ప్రక్రియలో భాగంగా మత పెద్దల అభిప్రాయం, అనుమతి తీసుకున్న అనంతరం తాజాగా తీర్పు వివరాలను అధికారికంగా వెల్లడించారు.

ఈ కేసులో మొత్తం 28 మందిపై విచారణ జరగగా.. 12 మందికి మరణ శిక్ష, తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించడంతో పాటు ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేశారు.