బాలాజీ కాంప్లెక్స్ గణపతి మండపంలో విషాదం
నంద్యాలఅర్బన్:బాలాజీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గణపతిని చూడడానికి మెడ పైనుంచి తొంగి చూసింది.నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మెడ పైనుంచి జారిపడటంతో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని గణపతి మండపాల నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా మండపాల్లో ఏర్పాటు చేసే విద్యుత్ పరికరాలు, వైర్లు, అలంకరణలు, ఎత్తైన ప్రదేశాల వద్ద చిన్నారులకు ప్రమాదం జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
మండపాలకు వచ్చే భక్తులు, ముఖ్యంగా చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. నిర్వాహకులు కూడా విద్యుత్ సంబంధిత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు
తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చిన్నారి మృతికి కారణమైన ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలను పరిశీలించి, భద్రతా చర్యలపై తగిన సూచనలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.