![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 01:06 PM
కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని పద్మాజీవాడి వద్ద గురువారం ఉదయం నుండి పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో వాహనదారులు తీసుకువెళుతున్న వాహనాలపై పెండింగ్లో ఉన్న చాలన్లు వసూలు చేయడంపై పోలీసులు దృష్టి సారించారు.
వాహనాల పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అంశాలతో పాటు వాహనాల నంబర్ ప్లేట్ల సరైన వినియోగంపైనా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ తనిఖీలను ఎస్ఐ రంజిత్ నేతృత్వంలో పోలీసులు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ నియమాల పాటనకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.