దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 12:54 PM
ఆక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించినట్లు బోధన్ మొదటి ఆడిషనల్ సివిల్ జడ్జి ఈ. సాయిశివ బుధవారం తీర్పు వెలువరించారు. నిజామాబాద్ నగరంలోని కోజ్జా కాలనీకి చెందిన మహమ్మద్ సుమీర్ఖాన్(21), మాలపల్లికి చెందిన ట్రాక్ డ్రైవర్ మహమ్మద్ అర్బాజ్(20)లు 2018లో ట్రాక్లో రేషన్ బియ్యంను తరలిస్తుండగా ఎడపల్లి వద్ద పట్టుకున్నట్లు తెలిపారు.
వీరిపై అప్పటీ ఎస్సై టాటాబాబు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. మహమ్మద్సమీర్ఖాన్, మహమ్మద్ అర్బాజ్కు మూడేళ్ల జైలు శిక్ష తోపాటు రూ. 3 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.