![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 12:23 PM
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పిన జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం . ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని సెంట్రల్ విజిలెన్స్ కమిటీ (సీవీసీ) తేల్చి చెప్పిందని, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం కుదరదని తేల్చి చెప్పిన ధర్మాసనం . ఇదే అంశంపై పిటిషనర్ అనేక పిల్ లు దాఖలు చేశారని, హైకోర్టు అన్నిటిని కొట్టేసిన తరువాత తాము హైకోర్టు తీర్పును తప్పు పట్టలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు . హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సరైన కారణాలు ఉన్నాయని, ఈ పిటిషన్ కు అర్హత లేదని కొట్టివేసిన సుప్రీంకోర్టు