BREAKING
రవితేజ నెక్స్ట్ మూవీపై క్రేజీ బజ్.. శ్రీ విష్ణుతో స్క్రీన్ షేర్! చెన్నైలో 130 కొత్త ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభం మార్ష్‌కు షాక్.. ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ కొత్త కెప్టెన్ ఎవరు? ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ఎయిర్ కార్గో హబ్ ఫెడెక్స్ $150 మిలియన్ల పెట్టుబడి మనం గెలిచింది 2% ఓట్లతోనే.. జాగ్రత్తగా ఉండాలి అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఫుడ్ లైసెన్సులు సస్పెండ్ Toxic Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు.. రిలీజ్‌కు ముందే టాక్సిక్ దూకుడు! లేడీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కూతురు డిసెంబర్‌లో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు చైనా అధ్యక్షుడి భారత్ పర్యటనపై కీలక కసరత్తు.. అజిత్ డోవల్ భేటీతో పెరిగిన ఆసక్తి కొండా సురేఖ చేరికపై నిర్ణయం అధిష్టానానిదే: బీజేపీ ఎంపీ డీకే అరుణ కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలకు సిఫార్సు! 19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. కేరళ యువతి కాజియా అరుదైన ఘనత 'ఇరుముడి' సినిమాలోని ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలి ‘ఇరుముడి’ విజయంపై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. 50 ఏళ్లలో ఇలాంటి సక్సెస్ చూడలేదంటూ!

మనం గెలిచింది 2% ఓట్లతోనే.. జాగ్రత్తగా ఉండాలి

Select Suryaa Now
మనం గెలిచింది 2% ఓట్లతోనే.. జాగ్రత్తగా ఉండాలి

కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ హెచ్చరిక

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఆమె పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, "మనం గత ఎన్నికల్లో కేవలం 2 శాతం ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి" అని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లు తొలగిపోతున్నాయని, అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలదేనని ఆమె తేల్చి చెప్పారు.

ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిపోతే అది రాబోయే రోజుల్లో పార్టీ గెలుపు అవకాశాలకే తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తూ, అర్హులైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.