BREAKING
19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. కేరళ యువతి కాజియా అరుదైన ఘనత 'ఇరుముడి' సినిమాలోని ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలి ‘ఇరుముడి’ విజయంపై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. 50 ఏళ్లలో ఇలాంటి సక్సెస్ చూడలేదంటూ! ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం మెదక్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారడం ఖాయం జిల్లా పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం రికార్డు స్థాయిల్లో బంగారం, వెండి ధరలు వైమానిక సర్వే నిర్వహించిన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి యశస్వి జైస్వాల్, అసిథా ఫెర్నాండోలకు మ్యాచ్ ఫీజులో కోత రూ. 1.1 కోట్లకు పైగా నగదు సీజ్ చేసిన ఈడీ భారత్-రష్యా సంబంధాల వృద్ధికి ప్రధాని మోదీనే కారణం చార్మినార్ అందాలకు ముగ్ధుడైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ గుజరాత్‌లో నిరంతర అత్యవసర సేవలు 2030 నాటికి $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం ఛత్తీస్‌గఢ్‌లో భారీగా నక్సల్స్ ఆయుధాలు స్వాధీనం

‘ఇరుముడి’ విజయంపై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. 50 ఏళ్లలో ఇలాంటి సక్సెస్ చూడలేదంటూ!

Select Suryaa Now
‘ఇరుముడి’ విజయంపై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు.. 50 ఏళ్లలో ఇలాంటి సక్సెస్ చూడలేదంటూ!

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రవితేజ సినిమాపై తన అనుభూతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

రవితేజ మాట్లాడుతూ.. సాధారణంగా తాను పెద్దగా భావోద్వేగాలకు గురికానని, అయితే ‘ఇరుముడి’ సినిమా చూసినప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పారు. హిందీలో రాజ్‌కుమార్ హిరాణీ సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి భావోద్వేగాన్ని కలిగిస్తాయో, తెలుగులో ‘ఇరుముడి’ కూడా అలాంటి అనుభూతిని అందిస్తోందని అన్నారు. తన కుమార్తె మోక్ష కూడా సినిమా చూసి ఎమోషనల్ అయ్యిందని తెలిపారు.

సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని రవితేజ ప్రశంసించారు. పాటలు, నేపథ్య సంగీతం కథలో భావోద్వేగాన్ని మరింతగా పెంచాయని పేర్కొన్నారు. చాలా కాలంగా థియేటర్లకు దూరంగా ఉన్న ప్రేక్షకులు సైతం ‘ఇరుముడి’ కోసం థియేటర్లకు వస్తున్నారని తెలిసి ఎంతో ఆనందంగా ఉందన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. తన గత చిత్రాలు ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ తనను ప్రేక్షకుల ఇళ్లకు చేరువ చేశాయని, కానీ ‘ఇరుముడి’ తనకు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కల్పించిందని రవితేజ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. కమర్షియల్ అంశాలకంటే ప్రేక్షకులతో భావోద్వేగంగా కనెక్ట్ కావడానికే ఈ సినిమాను రూపొందించామని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. విడుదలైన సుమారు ఒకటిన్నర రోజుల్లోనే సినిమా లాభాల్లోకి ప్రవేశించడం ఆనందంగా ఉందన్నారు. గత 50 ఏళ్లలో ఇలాంటి విజయం, ఇలాంటి రికార్డులు చూడలేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.