రూ. 1.1 కోట్లకు పైగా నగదు సీజ్ చేసిన ఈడీ
లక్నో: నకిలీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) అక్రమంగా పొందడం మరియు బదిలీ చేయడంపై నమోదైన ఆర్థిక నేరాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. 'జంబుద్వీప్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లిమిటెడ్' వ్యవహారంలో ఈడీ లక్నో జోన్ అధికారులు ఉత్తరప్రదేశ్లో పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో రూ. 1.1 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ముజఫర్నగర్లోని 'న్యూ రాణా హౌస్', ఘజియాబాద్లోని 'సుధా స్టీల్' ప్రాంగణాల్లో జరిపిన ఆకస్మిక దాడుల్లో ఈ భారీ సొమ్ము దొరికినట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ బిల్లులతో పన్నుల ఎగవేతకు పాల్పడుతున్న ఈ నెట్వర్క్పై మరింత నిఘా పెంచామని, ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు ఈడీ తెలిపింది.