BREAKING
వైమానిక సర్వే నిర్వహించిన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి యశస్వి జైస్వాల్, అసిథా ఫెర్నాండోలకు మ్యాచ్ ఫీజులో కోత రూ. 1.1 కోట్లకు పైగా నగదు సీజ్ చేసిన ఈడీ భారత్-రష్యా సంబంధాల వృద్ధికి ప్రధాని మోదీనే కారణం చార్మినార్ అందాలకు ముగ్ధుడైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ గుజరాత్‌లో నిరంతర అత్యవసర సేవలు 2030 నాటికి $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం ఛత్తీస్‌గఢ్‌లో భారీగా నక్సల్స్ ఆయుధాలు స్వాధీనం సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన 'అర్చన 31 నాటౌట్' (ఈటీవీ విన్) రివ్యూ! యువత డ్రగ్స్‌కు బానిస కావద్దు :భద్రాచలం డి.ఎస్.పి అరుణ్ కుమార్ గుంతలో చిక్కిన చిరుతను హతమార్చిన ముఠా ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ.. ప్రపంచ మార్కెట్లే లక్ష్యం: సీఎం చంద్రబాబు కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా

కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Select Suryaa Now
కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
  • పార్టీలో ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం
  • సీఎంపై కుమార్తె వ్యాఖ్యలతో కొండా సురేఖకు షోకాజ్ నోటీసు
  • కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమంటూ మంత్రి ఇచ్చిన వివరణ

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించబోనని, క్రమశిక్షణా సంఘమే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

ఇటీవల వరంగల్ జిల్లా గీసుగొండలో నిర్వహించిన మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలో ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన విమర్శలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీపీసీసీ క్రమశిక్షణా సంఘం, వివరణ కోరుతూ మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

షోకాజ్ నోటీసుకు మంత్రి కొండా సురేఖ ఇప్పటికే లిఖితపూర్వక సమాధానం సమర్పించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, ఆ అంశానికి తనను బాధ్యురాలిని చేయవద్దని వివరణలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరూ అతీతులు కారని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది