చార్మినార్ అందాలకు ముగ్ధుడైన అమెరికా రాయబారి సెర్గియో గోర్
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ చారిత్రక సంపదను, సంస్కృతిని అమెరికా రాయబారి (అంబాసిడర్) సెర్గియో గోర్ కొనియాడారు. నగర పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్ను సందర్శించారు.
ఈ సందర్శనకు సంబంధించిన అనుభవాన్ని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "హైదరాబాద్ నగరపు సుసంపన్నమైన చరిత్రకు అద్భుతమైన చిహ్నమైన, ఆ నగరపు ప్రసిద్ధ చార్మినార్ను సందర్శించడం చాలా ఆనందదాయకం!" అని ఆయన ట్వీట్ చేశారు.
విదేశీ రాయబారి హైదరాబాద్ ప్రాశస్త్యాన్ని, చార్మినార్ గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. నగర వారసత్వ కట్టడాల వైభవానికి ఇది మరొక నిదర్శనమని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.